Sunday, April 28, 2024

ఏపీలో కొత్తగా 3,841 కరోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 90,574 సాంపిల్స్ ని పరీక్షించగా 3,841 మంది కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. అలాగే కోవిడ్ వల్ల కృష్ణ లో ఎనిమిది, చిత్తూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, గుంటూరు లో ఐదుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరి లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, వైఎస్ఆర్ కడప లో ఇద్దరు, విజయనగరం లో ఇద్దరు, కర్నూల్ లో ఒక్కరు, నెల్లూరు లో ఒక్కరు మరియు విశాఖపట్నం లో ఒక్కరు మరణించారు.

అలాగే గడచిన 24 గంటల్లో 3,963 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.అలాగే నేటి వరకు రాష్ట్రంలో 2,20,84,192 సాంపిల్స్ ని పరీక్షించడం జరిగింది.

మొత్తం కేసుల సంఖ్య…1842432
డిశ్చార్జ్ కేసుల సంఖ్య…1893354
యాక్టీవ్ కేసుల సంఖ్య…38178
మొత్తం మరణాలు… 12744

Advertisement

తాజా వార్తలు

Advertisement