Saturday, May 11, 2024

శ్రీవారిని దర్శించుకునేందుకు 30గంటల సమయం

తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు 30గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. దేశంలోని నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో తిరుమల కిటికిటలాడుతుంది. కొండపై ఉన్న కంపార్టుమెంట్లు నిండి ఏటీజీహెచ్‌ వరకు భక్తులు క్యూలైన్లలో నిలిచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.65 కోట్లు వచ్చిందని వెల్లడించారు. నిన్న స్వామివారిని 72,216 మంది భక్తులు దర్శించుకోగా 32,338 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement