Wednesday, May 1, 2024

మ‌ణిపూర్ లో మ‌ళ్లీ హింస – ముగ్గురు మ‌ర‌ణం

ఇంపాలా – మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. గ‌త‌ అర్ధరాత్రి బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ముగ్గురు మరణించారు. కుకీ వర్గానికి చెందిన పలు ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి . మృతులను క్వాక్తా ప్రాంతంలోని మెయిటీ కమ్యూనిటీకి చెందినవారని పోలీసులు తెలిపారు.

కొందరు వ్యక్తులు బఫర్ జోన్‌ను దాటి మెయిటీలు ఉండే ప్రాంతాలకు వచ్చారని, అనంతరం వారిపై కాల్పులు జరిపారని వెల్లడించారు. ఘటనా స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలో భద్రతా దళాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పూర్తిగా తమ అదుపులో ఉందన్నారు. కాల్పులు జ‌రిపిన వారి కోసం గాలిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement