Saturday, May 4, 2024

ఆధార్‌ వెరిఫికేషన్‌కు 22 సంస్థలకు అనుమతి

దేశంలో 22 ఆర్ధిక సంస్థలకు ఆధార్‌ వెరిఫికేషన్‌కు ఆర్ధిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సంస్థలకు చెందిన కస్టమర్లు, లద్దిదారుల వివరాలను ఆధార్‌ కార్డుతో వెరిఫికేషన్‌ చేసుకునేందుకు అనమతి ఇస్తూ ఆర్ధిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ సంస్థలన్నీ ఇప్పటికే కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లెండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద నమోదై ఉన్నాయి.

ఇలా అనుమతించిన వాటిలో గోద్రేజ్‌ ఫైనాన్స్‌, అమెెజాన్‌ పే ఇండియా, ఆదిత్య బిర్లా హౌస్సింగ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌ ఫైనాన్స్‌ సొల్యూషన్స్‌, ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, మహీంద్రా రూరల్‌ హౌస్సింగ్‌ ఫైనాన్స్‌, హీరో ఫిన్‌కార్ప్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు వెరిఫికేషన్‌కు పాస్‌పోర్టు తో పాటు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ఇతర గుర్తింపులతో పాటు ఆధార్‌ ఆధారిత వెరిఫికేషన్‌ కూడా చేసుకునే వెసులుబాటు కలిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement