Sunday, May 5, 2024

రాష్ట్రంలో కొత్తగా 219 క‌రోనా కేసులు నమోదు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా తెలంగాణలో 219 కరోనా కేసులు నమోదయ్యాయి. థర్డ్‌ వేవ్‌ ముగిసిన ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 200దాటడం ఇదే మొదటిసారి. మరో 76మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇంట్లోనో లేదంటే ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్న వారి యాక్టివ్‌ కేసుల సంఖ్య 1259కి చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా 22, 662 మందికి కరోనా టెస్టులు చేయగా 219 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే 164 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌-మల్కాజిగిరిలో 11, రంగారెడ్డిలో 19 కేసులు వెలుగు చూశాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement