Monday, April 29, 2024

మళ్ళీ పెరిగిన కరోనా కేసులు…కొత్తగా 2,11,298 కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. మొన్నటి ఒక్క రోజే తగ్గిన కేసులు ఇప్పుడు మళ్లీ పెరగటం ఆందోళన కలిగిస్తుంది. అలాగే మరణాలు కూడా అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,11,298 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కొత్తగా 3847 మంది మృతి చెందారు. అలాగే ప్రస్తుతం దేశంలో మొత్తం 2419907 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి కోలుకుని 24633951 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27369093కి చేరింది. 3,15,235 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు.

కొత్తగా నమోదు అయిన కేసుల్లో అత్య‌ధికంగా త‌మిళ‌నాడులో 33,764, కేర‌ళ 28,798, క‌ర్ణాట‌క 26,811, మ‌హారాష్ట్ర 24,752, ఏపీలో 18,285 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement