Sunday, April 28, 2024

ఏపీలో తగ్గని కరోనా జోరు….106 మంది కరోనా తో మృతి

ఏపీలో కరోనా జోరు ఏ మాత్రం తగ్గటం లేదు. గ‌డిచిన 24గంట‌ల్లో కొత్తగా 23,160 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే కరోనా కారణంగా 106మంది మృతి చెందారు.మరోవైపు 24,819మంది క‌రోనాను నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక రాష్ట్రంలో అత్య‌ధికంగా తూర్పు గోదావరి లో 3528కేసులు ఆ తరువాత పశ్చిమగోదావరి జిల్లాలో అత్య‌ధికంగా 17మంది మ‌ర‌ణించారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 2,09,736యాక్టివ్ కేసులున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య 9,686కు చేరింది.

కొత్తగా మృతిచెందిన వారిలో పశ్చిమ గోదావరిలో 17, నెల్లూరులో 11, విశాఖపట్నంలో 11 ,తూర్పుగోదావరిలో 9, విజయనగరంలో 9 ,అనంతపూర్ లో 8 ,చిత్తూరులో 8, కృష్ణ లో 8, శ్రీకాకుళంలో 8 ,గుంటూరులో ఏడుగురు, కర్నూలులో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు ,కడపలో ఒకరు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement