Saturday, May 4, 2024

ఏపీలో తగ్గని కరోనా మరణాలు…24 గంటల్లో 104 మంది మృతి

ఏపీలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుంది.కానీ మరణాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా గడిచిన 24గంట‌ల్లో మొత్తం 93,704మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా 11,303మందికి పాజిటివ్ వచ్చింది. మరో వైపు మహమ్మారి కారణంగా 104మంది మృతి చెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,257మంది క‌రోనా నుంచి కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 1,46,737 యాక్టివ్ కేసులుండ‌గా, మ‌ర‌ణాల సంఖ్య 11,034కి చేరింది. క‌రోనా మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో పశ్చిమగోదావరి జిల్లాలో అత్యధికంగా 20మంది చనిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement