Saturday, May 18, 2024

ఏపీలో 10 పరీక్షలు వాయిదా?

కరోనా మహమ్మారి కారణంగా అన్ని రకాల పరీక్షలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఏపీలో పదో తరగతి పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. జూన్ 7 నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా… నెల రోజులు వాయిదా వేయాలని బోర్డు సీఎం జగన్ కు ప్రతిపాదనలు పంపింది.

దీనిపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు. అటు పరీక్షలు వాయిదా పడితే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా ఇంటర్నల్ మార్కుల నమోదు పూర్తి చేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement