Friday, April 26, 2024

సమాజంలో మార్పు కోసం ఓటు వేయాలని గవర్నర్ పిలుపు

ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడలో గవర్నర్ దంపతులు తమ ఓటు వేశారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా ముఖ్యమని, సమాజంలో మార్పు రావాలంటూ ఓటు వేయడం తప్పనిసరి అని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా బాధ్యతగా తాను ఓటు వేశానని, ప్రజలు కూడా ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement