Saturday, May 11, 2024

విశాఖపట్నం : వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయసాయి పాదయాత్ర

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. విశాఖ జివీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన, ముత్తంశెట్టి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ఆర్చి నుంచి నగరంలో పాతిక కిలో మీటర్ల మేర విజయసాయి పాదయాత్ర కొనసాగుతుంది.  పాదయాత్ర ముగిసిన అనంతరం విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద బహిరంగ సభలో విజయ సాయి ప్రసంగిస్తారు.  సీఎం జ‌గ‌న్ ఆదేశాల మేరకు పాదయాత్ర చేపట్టినట్లు విజయసాయి రెడ్డి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement