అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రానా హీరోగా నటిస్తున్న ‘విరాట పర్వం’ నుండి ప్రత్యేక వీడియో విడుదలైంది. రానా వాయిస్ ఓవర్తో ఈ వీడియో ఉండగా ఇందులో సాయి పల్లవితో పాటు, జాతీయ అవార్డు గెలుచుకున్న నటీమణులు నందితా దాస్ , ప్రియామణి, చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న ఈశ్వరి రావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ ఉన్నారు. విరాట పర్వంలో వీరి పాత్ర చాలా గొప్పగా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్.ఎల్.వి.సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30న ఈ మూవీ విడుదల కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement