Friday, May 3, 2024

వరుసగా నాలుగో రోజూ పెరిగిన పెట్రో ధరలు

పెట్రో మంట సామాన్యుడికి దడ పుట్టిస్తున్నది. వరుసగా నాలుగో రోజు కూడా పెట్రో ధరలు పెరిగాయి   ఆయిల్‌ కంపెనీలు  లీటరు  పెట్రోల్‌, పై 29 పైసలు, డీజిల్‌పై35 పైసలు ధర పెంచుతూ శుక్రవారం ప్రకటించాయి.  . ఈ నెలలో  ఇప్పటి వరకూ పెట్రో ధరలు  ధరలు పెరగడం ఇది ఆరోసారి.తాజా పెంపుతో దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.14కు, డీజిల్‌ ధర రూ. 78.38కు పెరిగింది. తెలంగాణ రాజధాని    లీటర్‌ పెట్రోల్‌ ధర శుక్రవారం రూ. 91.65కు చేరింది. లీటర్‌ డీజిల్‌ ధర రూ. 85.50గా ఉంది.  దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 94.64కు చేరగా.. డీజిల్‌ ధర రూ. 85.32గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement