Sunday, April 28, 2024

మహిళా దినోత్సవం రోజున మహిళపై యాసిడ్ దాడి

మహిళా దినోత్సవం రోజున ఉమ్మడి మెదక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్‌తో దాడి చేశారు. అల్లాదుర్గం మండలం మార్కాపూర్ తండాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే టేక్మాల్ మండలం మల్కప చెందిన హాలవత్ చత్రుబాయ్‌పై ఆదివారం రాత్రి కొందతు గుర్తు తెలియని దుండగులు అల్లాదుర్గ్ మండలం గడిపెడ్డపుర్ వద్ద అడ్డుకుని ఆమెపై యాసిడ్‌తో దాడి చేశారు.

తీవ్ర గాయాలతో ఉన్న చత్రుబాయ్‌ను స్థానికులు జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సంగారెడ్డికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా అస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement