Monday, May 6, 2024

న్యూఢిల్లీ : దిశా రవికి బెయిలు

టూల్ కిట్ కేసులో పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 1 లక్ష విలువైన రెండు షూరిటీలు సమర్పించాలని   కోర్టు ఆదేశించింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళలకు మద్దతుగా టూల్ కిట్ ను రూపొందించారనే ఆరోపణలతో   ఆమెను బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దిశా రవి మరో ఇద్దరు ఖలిస్థానీ గ్రూప్ కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు ఆరోపించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు టూల్ కిట్ ను రూపొందించారని పేర్కొన్నారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement