Wednesday, April 24, 2024

యాదాద్రిలో కన్నుల పండువగా భీష్మ ఏకాదశి ఉత్సవం

 లకీëనృసింహస్వామి స్వామి సన్నిధిలో మంగళవారం భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని లక్ష పుష్పార్చనను శాస్తోక్తముగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు సహస్ర నామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన జరిపారు. సుమారు రెండు గంటల పాటు పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతీ ఏకాదశి పర్వదినం రోజు స్వయంభూ పంచనారసింహుడు కొలువు దీరిన యాదాద్రి క్షేత్రంలో స్వామిని లక్ష పుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. కార్యక్రమంలో దేవస్థాన ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక బృందం, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement