Monday, April 29, 2024

న్యూఢిల్లీ : జాతీయ భద్రతా సలహాదారు హత్యకు రెక్కీ

జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌ హత్యకు కుట్ర జరిగిందని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆయనపై నిఘా పెట్టి మరీ హత్యకు రెక్కీ కూడా నిర్వహించారని పేర్కొన్నాయి. ఆయన నివాసం వద్దే ధోవల్ ను హత్య చేసేందుకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించారు. ఈ విషయం  ఇటీవల అరెస్టైన జైష్‌-ఎ-మొహమ్మద్‌ (జేఈఎమ్‌) ఉగ్రవాది హిదాయత్‌ ఉల్లా మాలిక్  బయటపెట్టినట్లు అధికారులు తెలిపారు.  దీంతో అజిత్‌ దోవల్‌ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement