ప్రముఖ చిత్రనిర్మాణ, మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ టి.సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్పై అత్యాచార కేసు నమోదైంది. పని కల్పిస్తానని నమ్మించి 2017 నుంచి 2020 ఆగస్టు వరకు తనను లైంగికంగా వాడుకున్నాడని 30 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడేళ్లపాటు వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పేర్కొంటూ ముంబైలోని అంధేరీ డీఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని తనను బెదిరించినట్లు ఆరోపించింది.
దీంతో అతడిపై FIR నమోదు చేసినట్లు ముంబై- డీఎన్ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భూషణ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది. మరోవైపు భూషణ్ ఈ ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. టి.సిరీస్ స్థాపకుడు, మధురగాయకుడైన గుల్షన్ కుమార్ పెద్ద కొడుకు అయిన భూషణ్ కుమార్ దువా ప్రస్తుతం టి.సిరీస్కు ఛైర్మన్, ఎండీగా కొనసాగుతున్నాడు. ఆయన భార్య నటి దివ్యా ఖోస్లా.
ఈ వార్త కూడా చదవండి: ఛత్రపతి రీమేక్కు క్లాప్ కొట్టిన రాజమౌళి