Saturday, April 27, 2024

గుడివాడలో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

కృష్ణాజిల్లా గుడివాడ ఆర్.సి.యం ప్రైమరీ పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఒకటి, రెండువ తరగతులకు చెందిన 10మంది విద్యార్థులు పాఠశాలలో కళ్ళు తిరిగి పడిపోయారు. ప్రస్తుతం వీరు ఆర్ సీ ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలు యాజమాన్యాన్ని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పట్లేదు. హాస్పిటల్ అధికారులు కూడా కారణాలు చెప్పకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఘటనపై ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులు స్పందించలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement