Monday, April 29, 2024

ఐ యామ్ సారీ ఛైర్మ‌న్

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు విజ‌య‌సాయి రెడ్డి సారీ చెప్పారు..‘నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదు. ఆవేశంలో మాట్లాడాను.. నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను. నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విధంగా జరగదని హామీ ఇస్తున్నాను’ అని విజయసాయిరెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. కాగా, నిన్న విజ‌య‌సాయి రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ, ‘మీ మనసు, ఆత్మ బీజేపీపైన! తనువు టీడీపీపైన’ అని రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ స్థానంలో ఉన్న వెంక‌య్య‌నాయుడిని ఉద్దేశించివ్యాఖ్యానించడంతో పార్టీలకు అతీతంగా సభ్యులందరూ నివ్వెర పోయారు. సాయి రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసి.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే నేడు రాజ్య‌స‌భ ప్రారంభమైన వెంట‌నే విజయసాయిరెడ్డిని కేంద్ర పార్లమెంటరి వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి మందలించారు. ‘నిన్న ఉపరాష్ట్రపతి పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు సబబు కాదు. రాజ్యసభ చైర్మన్ పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నిన్న జరిగింది నిందించదగినది. ఉపరాష్ట్రపతికి క్షమాపణలు చెప్పాలి’ అని విజయసాయిని జోషి మందలించారు. ఈ మందలింపు అనంతరం రాజ్యసభకు వెళ్లిన విజయసాయి ‘ఐయామ్ సారీ’ అంటూ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement