Friday, April 19, 2024

తెలంగాణాలో రాజ‌న్న రాజ్యం తెస్తాంః వైఎస్ ష‌ర్మిల‌..

హైద‌రాబాద్ – తెలంగాణలో రాష్ట్రంలో వైఎస్ ఆర్ త‌న‌య షర్మిల కొత్త పార్టీ స్థాపించనున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తామని వైఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజన్న రాజ్యం లేదన్నారు. రాజన్న రాజ్యం ఎందుకు లేదు ?..ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. కచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొస్తామని ఆమె స్పష్టం చేశారు. బెంగుళూరు నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన ష‌ర్మిల నేడు లోట‌స్ పాండ్ లో త‌న అభిమానులో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించారు.. . చాలారోజుల తర్వాత లోటస్ పాండ్‌కు వచ్చిన ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. జై షర్మిలక్క అంటూ నినాదాలు చేశారు అభిమానులు. జోహార్ వైఎస్‌ఆర్‌ అంటూ స్లోగన్స్‌తో లోటస్ పాండ్ మారుమోగిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానులతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణలో వైఎస్ఆర్ లేని లోటు కన్పిస్తోందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎలాంటి పరిస్థితులున్నాయో అధ్యయనం చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లాల నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైనట్లు తెలిపారు. మిగిలిన జిల్లాల నేతలతోనూ సమావేశమవుతామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వారికి బాగా తెలుసన్నారు. పార్టీ ఏర్పాటు అంశాన్ని ఖండించకపోయినా ఆ దిశగానే అడుగులు ఉండబోతున్నాయని తేల్చేశారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్టు స‌మాచారం..

Advertisement

తాజా వార్తలు

Advertisement