Monday, May 6, 2024

ఎన్ కౌంటర్….ఐదుగురు మావోయిస్టులు మృతి

మహరాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఖురుకేడ తాలుక కొబ్రామెండ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగగా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులుగా తెలుస్తుంది. పోలీసులు, అదనపు బలగాలు కలిసి ఈ కూంబీంగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాగా తప్పించుకున్న వారి కోసం గాలింపు చేస్తున్నామని నక్సల్స్‌ను మొత్తం ఏరివేసేవరకు ఈ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మృతి చెందగా..మరి మరికొంత మంది మారోయిస్టులకు తీవ్ర గాయాలు అయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement