Friday, May 3, 2024

అహ్మదాబాద్ : కపిల్ తరువాత 100 టెస్టులు ఆడిన ఇండియన్ పేసర్ ఇషాంత్

సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. తన టెస్టు కెరీర్‌లో ఇషాంత్‌ బుధవారం వందో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాడు. దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ కపిల్‌ (131) తరువాత వందో టెస్టు ఆడుతున్న భారత్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ఇషాంతే కావడం విశేషం. ఈ సందర్భంగా అతనికి సీనియర్లు శుభాకాంక్షలు తెలిపారు. మ్యా చ్‌ ప్రారంభోత్సవానికి ముందు.. టాస్‌ తరువాత.. ఇరు జట్ల ఆటగాళ్లను రాష్ట్రపతి పరిచయం చేసుకున్నారు. రాష్ట్రపతికి భారత్‌ క్రికెటర్లను కెప్టెన్‌ విరాట్‌ పరిచయం చేశాడు. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్‌ను ముందుగా పరిచయం చేయగా.. లంబుకు రాష్ట్రపతి జ్ఞాపికను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement