Friday, May 10, 2024

అసలు ఈ పెద్ద మనిషికి బుద్ధి ఉందా?

మహిళా దినోత్సవం నాడు తమిళనాడులో దారుణ ఉదంతం వెలుగు చూసింది. 68 ఏళ్ల వృద్ధుడు పుష్పరాజ్ బాలికలకు చాక్లెట్లు ఇచ్చి వారికి అశ్లీల వీడియోలు చూపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సదరు పెద్ద మనిషిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 12 ఏళ్ల బాలిక తల్లి వృద్ధుల సంరక్షకురాలిగా పనిచేస్తోంది. దీంతో నిందితుడు సదరు బాలికకు గేమ్స్‌ ఆడుకోమని తన సెల్‌ఫోన్‌ ఇస్తుండేవాడు. ఈ క్రమంలో అశ్లీల వీడియోలను చూసేలా బాధితురాలిని ప్రేరేపించి లైంగిక దాడికి పాల్పడేవాడు. బాలిక ఈ విషయం తన అమ్మకు చెప్పడంతో ఆమె నిందితుడిని నిలదీసింది. నిందితుడు తన మొబైల్‌ ఫోన్‌లో అశ్లీల వీడియోలను స్టోర్‌ చేసినట్టు బాలిక తల్లి గుర్తించింది. ఈ మేరకు పుష్పరాజ్‌ నిర్వాకంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మరో ముగ్గురు బాలికలపైనా ఇలాగే వేధింపులకు పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement