Sunday, April 28, 2024

వివేకం వికసిస్తే మానవతకు సార్ధకత

మనలో ఉన్న చెడు భావాలు, హంసా ప్రవృత్తి మొదలైనవి లోపలి జ్ఞానాన్ని కప్పేసి అజ్ఞానం అనే చీకటిని ఏర్పరు స్తాయి. వాటిని తొలగించుకొంటే, చీకటిపోయి వెలుగు ప్రవేశించి జ్ఞానోదయమై జీవితానికి మార్గదర్శనం చేస్తాయి. అంద రూ కలిసి ఆలోచిస్తే, కలిసి పనిచేస్తే అసాధ్యమైన కార్యం కూడా సుసాధ్యమౌతుంది. కలసి ఉంటే కలదు సుఖం అన్నారు. మనం ఉన్న సమాజానికి మేలు చేసే ఆలోచన ఎప్పుడూ ఉండాలి. మనసు మాలిన్య రహితంగా ఉంచుకొంటేనే, ఇహపరాలకు మార్గం సుగమం అవుతుంది. నిర్మలమైన మనసులో నిశ్చయ జ్ఞానం కలిగి, దివ్యజ్యోతి వెలుగుతుంది. మానవ జీవిత గమ్యం ఆ దివ్యజ్యోతి సందర్శనమే. చిత్తశుద్ధి లేకపోతే, శివుని అనుగ్రహం కలుగదు. అజ్ఞానపు పొరలు తొలగితే జ్ఞాన ప్రకాశం కలిగి దివ్యానుభూతి లభి స్తుంది .ఇదే చిరంతనమైనది, శాశ్వతమైనది. దీనికి మించింది లేదు. ఈ విషయాన్ని గుర్తించి మనం రుజుమార్గంలో ప్రయాణిం చి మానవ జన్మ సార్ధకతను రుజువు చేసుకోవాలి. కఠిన మనస్కుల తోనూ కలివిడిగా ఉంటే, మనలోని మృదుత్వానికి పరిపూర్ణత సిద్ధి స్తుంది. మంటల మాటున మంచు ఉంటుందని, కఠిన శిలల్లోనూ నీరు ఉంటుందని తెలుసుకోవటమే వివేకం. వివేకం వికశిస్తే మానవ తకు సార్ధక్యం. దీన్ని తెలియ జెప్పే చిన్న కథ తెలుసుకొందాం.
ఒక ఊళ్ళో ఊరికి అంతటికీ పని కొచ్చే ఒకే ఒక మంచి నీటి బావి ఉంది. దాని నీరు అమృత తుల్యం. అందుకని గ్రామ ప్రజలు ఇక్కడికే వచ్చి నీళ్ళు తోడు కొని ఇళ్ళకు తీసుకు వెడతారు. అందరూ దాని లోని నీటిని వాడుకోవటమే కాని, దాని చుట్టూ గోడకాని, గిలక కాని ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోలేదు. ముసలి, ముతక, పిల్లా జెల్లా అందరూ ఆ బావి ఒడ్డున ఒంగి బిందెలతో, కడవలతో నీళ్ళు చేదుకోనేవా రు. ఒక రోజు అర్ధరాత్రి ఒక కుక్క అక్కడ తిరుగుతూ నేలబారుగా ఉన్న ఆ బావిలో పడి,, బయటకు వచ్చే ప్రయత్నాలన్నీ చేసి, విఫ లమై ఆ నీటిలో మునిగి చనిపోయిం ది . ఈ విషయం గ్రామంలోని వారికి తెలియదు. మర్నాడు ఉదయం గ్రామస్తులు యధాప్రకారం నీటి కోసం బావి దగ్గరకు వచ్చారు. నీళ్ళు తోడుతుం ట విపరీతమైన దుర్వాసన వచ్చింది. ఆ నీటిని తాగితే జబ్బులు వచ్చి ప్రాణహాని జరుగుతుందని ఆలోచిం చి, ఇంటికి ఒకరు వంతున, బావి నీరు తోడే కార్యక్రమం మొదలు పెట్టారు. ఎన్ని నీళ్ళు తోడినా, దుర్వా సన పెరిగిందే కాని తగ్గలేదు. బావి లో చచ్చిన కుక్క ఉన్నదన్న సంగతి తెలియదు కనుక, నిరంత రం నీరు తోడుతూనే ఉన్నారు. ‘కిం కర్తవ్యమ్‌’ అని ఆలోచించారు. బావి లోపల ఏదో జంతువు చచ్చి పడి ఉంటుందని గ్రహించి, నూతి పూడిక తీసేవాడిని పిలిపిం చి బావిలోకి దింపారు .వాడు బాగా మునిగి తేలుతూ, కుక్క శరీరా న్ని గుర్తించి, అందరి సాయంతో బయటకు లాగి పడేశాడు. అంద రూ కలిసి బావికి చాలాదూరంలో దాన్ని పాతిపెట్టారు. మళ్ళీ నీళ్ళు తోడి పారబొయ్యటం ప్రారంభిం చారు. కొంతసేపటికి అతి స్వచ్చ మైన, దుర్వాసన లేని మంచి నీరు వచ్చింది. హమ్మయ్య అనుకొన్నా రు. తమ తప్పు తెలుసుకొని బావి చుట్టూ, పిట్టగోడ కట్టి, గిలకలు ఏర్పాటు చేసి, నిర్వ#హణ బాధ్యత కూడా చేబట్టారు బావిలో చచ్చిన కుక్క కళేబరం ఉన్నంత దాకా, నీరు ఎంత తోడినా వాసన పోనట్లే, మనలోని అజ్ఞానం అనే వాసనపోయే వరకు మనసు నిర్మలం కాదు, జ్ఞాన జ్యోతి వెలగదు అని మనం గ్రహించాలి. తన గురించి తనకే తెలియకపోవటం అజ్ఞా నం. అది తెలుసుకొంటే జ్ఞానం. జ్ఞానాన్ని అన్వయించుకోవటం విజ్ఞానం. అనుభవానికి కారణమైన దాన్ని తెలుసుకోవటం సుజ్ఞానం. జ్ఞానులు నిరంతరం నిర్మలమైన మనసుతో ఉంటూ, ఆనందాన్ని ఆనంద లహరిని అనుభవిస్తారు.

  • కామిడి సతీష్‌రెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement