Tuesday, April 30, 2024

వామనమూర్తి అలంకరణలో సింహాద్రినాధుడు

విశాఖపట్నం, ప్రభన్యూస్‌ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో రాపత్‌ ఉత్సవాలను పురస్కరించుకొని ఆ సిరులొలికించే సింహాద్రినాధుడు ప్రతీరోజు ప్రత్యేక అలం కరణలలో భక్తు లకు దర్శనమిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే సోమవారం వామ నమూర్తిగా సింహాచలేశుడు భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాభరణభూషితు డైన ఆ స్వామిని వేద మంత్రోశ్చరణలు, మృదుమధుర మంగళవాయి ద్యాల నడుమ మాడవీధుల్లో తిరువీధి నిర్వ హించారు. అంతకుముందు ఆలయ ఆస్థాన మండపంలో ఆశీనులను చేసి వేద, ఇతిహాస, పురాణ దివ్యప్రబంధ పారాయణలు విన్నవించారు. పలువురు అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement