Sunday, April 28, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈరోజు భ‌క్తుల ర‌ద్దీ కొంత‌మేర త‌గ్గిన‌ట్లు తెలిపారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండ‌గా.. వీరికి ద‌ర్శ‌నానికి 12 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 68,354 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,159 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు వచ్చినట్లు ఆయల అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement