ఘోర రోడ్డుప్రమాదంలో 10మంది షిరిడి సాయి భక్తులు మృతిచెందిన విషాద ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్ర లోని నాసిక్, షిరిడి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా భక్తులతో వెళుతున్న బస్సు.. ట్రక్కులు ఢీకొనడంతో ఏకంగా 10 మంది మృతిచెందారు. ఆటో ట్రక్కులు ఢీకొట్టగానే బస్సు బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -