Monday, April 29, 2024

తెప్పలపై శ్రీ సోమస్కందస్వామివారి కటాక్షం

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం శ్రీ సోమస్కందస్వామివారు తెప్పలపై భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవం వేడుకగా జరిగింది. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సోమస్కందస్వామివారు కపిలతీర్థం పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగారు. పెద్ద ఎత్తున హాజరైన భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. ఈ సందర్భంగా తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement