Sunday, May 5, 2024

ఆధ్యాత్మిక సాధనలు-సత్ఫలితములు

ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీ: సమా:
శుచీనాం శ్రీమతాం గేహ యోగభ్రష్టోభిజాయతే
భగవద్గీత 6 వ అధ్యాయం 41 వ శ్లోకం
ఓ అర్జునా! యోగహష్టుడైనవాడు పుణ్యజీవులు వసించు పుణ్యలోకములయందు అనేకానేక సంవత్సరములు సుఖముల ననుభవించిన పిమ్మట పవిత్ర కుటుంంబమున గాని లేదా శ్రీమంతుల గృహమున కాని జన్మించును. గీతాచార్యుడు యోగ సాధన ప్రాశస్థ్యాన్ని బోధించే సమయంలో అర్జునుడికి ఒక సంశయం కలిగింది. కొన్ని కారణల వలన ఒక సాధ కుడు ఆధ్యాత్మిక మార్గం నుండి వైదొలగినట్లయితే అతడు ఆధ్యాత్మిక జయము, లౌకిక జయ ము రెండింటినీ పొందనివాడై, రెండింటికి చెడిన రేవడిలా అయితే ఇక అతని పరిస్థితి ఏమిటి?
ఈ ఉభయ భష్టత్వం నుండి తప్పించుకోవాలంటే మార్గం ఏమిటి అన్న సంశయాన్ని శ్రీకృ ష్ణుడి ముందు వుంచగా దానికి శ్రీకృష్ణుడు పై శ్లోకం ద్వారా చక్కని వివరణ, ఆధ్యాత్మికతను నమ్ముకున్నా వారెవరూ ఎన్నటికీ చెడిపోరని ఒక అద్భుతమైన అభయం కుడా ఇచ్చారు. ఆధ్యాత్మిక జీవితంలో కృతకృత్యులు కాని వారిని శాస్త్రం రెండు విధాలుగా విభజించింది. కొద్దిపాటి పురోగతి తర్వాత పతనం పొందే వారు, అంటే సాధన ఆపివేసినవారు. రెండవ తరగతి ఆధ్యాత్మిక సాధనను తీవ్రంగా చేసి న పిమ్మట మార్గం నుండి మరలినవారు. మొదటి వర్గం వారు మరణానంతరం కొం తకాలం పాటు పుణ్య లోకాలలో ప్రవేశించు టకు, అక్కడ కొంత కాలం నివ సించేటందు కు అర్హత సాధిస్తారు. వారి భౌతిక కోరికలన్నీ తీరిన తర్వాత తిరిగి మరుజన్మలో తమ ఆధ్యాత్మిక సాధనను పున: ప్రారంభిస్తారు. రెండవ వర్గం వారు తమ ఆధ్యా త్మిక సాధన మధ్యలోనే ఆపివేసి యోగ భ్రష్టులైనందున వారు పుణ్యలోకాలలో తమ పుణ్యం వున్నంతవరకు నివసించి, అక్కడ తమ పుణ్యం అంతా వ్యయమైపోయిన తర్వాత తిరిగి భూలోకమునకు పంపబడి అక్కడ ఒక పవిత్రమైన కుటుం బంలో జన్మిస్తారు. వారి పూర్వజన్మ సంస్కారం వలన ఆ కుటుంబంలో చక్కని ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి వారు తిరిగి తమ సాధనను కొనసాగించగలుగుతారు. ఈవిధంగా యోగ భ్రష్టులైన వారికి కూడా తిరిగి తమ సాధన కొనసాగించగలిగే అవకాశం తిరిగి భగవం తుడు మానవాళికి ప్రసాదిస్తున్నాడు. ఈ అవకాశం ఇంక ఏ ప్రాణికీ కల్పింప బడలేదు. అయితే ఆధ్యాత్మిక సాధనలో ప్రవేశించినవారు తాము ఎటువంటి భౌతిక ఆకర్ష ణలకు గురికాకుండా జాగ్రత్త వహంచాలని శాస్త్రం హచ్చరిస్తోంది. రెండవ వర్గంవారికి తమ నూతన జీవితారంభం నుండే అంటూ శిశువు దశలోనే ఆధ్యా త్మిక ప్రోత్సాహం లభిస్తుంది. మొత్తం మీద ఆధ్యాత్మిక ప్రయత్నములు ఎన్నడూ వ్యర్ధం కావని. ఎన్ని జన్మలకైనా అవి సత్ఫలితాలనిస్తాయని భగవా నుడు ఈ శ్లోకం ద్వారా మరొకసారి భయం ఇస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement