Thursday, April 25, 2024

మచిలీపట్నంలో స‌భ‌.. తొలిసారి ‘వారాహి’లో రానున్న పవన్ కల్యాణ్..

మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ ఈరోజు సాయంత్రం జ‌ర‌గ‌నుంది. ఈ స‌భ‌కు జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ రానున్నారు. అయితే తొలిసారి వారాహి వాహ‌నంలో ప‌వ‌న్ క‌ల్యాన్ పార్టీ కార్య‌క్ర‌మానికి రానున్నారు. మ‌ధ్యాహ్నం 12.30కు నోవాటెల్ హోటల్ నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బయలుదేరుతారు. 1.00 కు ఆటోనగర్ ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడి నుంచి వారాహి వాహనం ద్వారా జనసేన ఆవిర్భావ సభ, మచిలీపట్నం బయలుదేరుతారు. తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు – గుడివాడ సెంటర్ (బైపాస్), గూడూరు సెంటర్ మీదుగా 5 గం.కు మచిలీపట్నంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆవిర్భావ సభ వేదికపై కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. అనంత‌రం స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement