Sunday, April 28, 2024

త్రివిక్రమ అలంకరణలో సింహాద్రినాథుడు

సింహాచలం (విశాఖపట్నం), ప్రభన్యూస్‌: సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో రాపత్‌ ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సింహాద్రినాధుడిని ప్రతిరోజు ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే మంగళవారం సిరిలొలికించే సింహాద్రినాధుడిని త్రివిక్రముడిగా సర్వాభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం వేద, దివ్యప్రబంద పారాయణల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరువీధి వైభవంగా నిర్వహించారు. తొలుత ఉభయదేవేరులతో ఆలయ ఆస్ఠాన మండపంలో స్వామిని ఆశీనులను చేసి దివ్యప్రబందపారాయణలు విన్నవించారు. పలువురు భక్తులు స్వామిని దర్శించి, సేవించి తరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement