Friday, April 26, 2024

kuppam: ప్రాణం తీసిన క‌రోనా భ‌యం

క‌రోనా భ‌యం ఓ యువ‌కుడి ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. ఈ ఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పంలో చోటుచేసుకుంది. భవనం పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకునేలా దారితీసింది. కుటుంబ కలహాలతో నిన్న రాత్రి యువకుడు పురుగులమందు తాగాడు. కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చగా, కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. ఆస్పత్రి అద్దాలు పగులగొట్టి భవనం పైనుంచి దూకి యువకుడు బలవన్మరణం చెందాడు. మృతుడు కుప్పం లక్ష్మీపురానికి చెందిన విజయ్‌ ఆచారి(30)గా గుర్తించారు. ఆ యువ‌కుడు కరోనా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement