Monday, April 29, 2024

శాస్త్రోక్తంగా పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం

తిరుచానూరు, ప్రభన్యూస్‌: తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన బుధవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయం వద్దగల వాహన మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు- చేసిన చిన్న పుష్కరిణిలో ఉదయం 11.52 గంటలకు కుంభ లగ్నంలో పంచమీ తీర్థం నిర్వహించారు. ఉదయం అమ్మవారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి వాహన మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్తలు, ఆభరణంతో కూడిన సారె బయల్దేరి ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. సారెను అమ్మవారికి సమర్పించి పూజలు నిర్వహించారు. కాగా రాత్రి బంగారు తిరుచ్చి వాహనంలో అమ్మవారి ఉత్సవర్లను ఆలయంలో ఊరేగించిన అనంతరం ధ్వజావరోహణం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దజీయర్‌ స్వామి, చిన్నజీయర్‌ స్వామి, టిటిడి ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి దంపతులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, బోర్డు సభ్యులు, చంద్రగిరి ఎంఎల్‌ఏ డా. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు పోకల అశోక్‌ కుమార్‌, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం దంపతులు, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, విఎస్వోలు మనోహర్‌, బాలిరెడ్డి, ఎస్‌ఇ సత్యనారాయణ, ప్రత్యేక శ్రేణి డెప్యూటీ- ఈఓ రాజేంద్రుడు, డెప్యూటీ- ఈవోలు రమేష్‌ బాబు, కస్తూరిబాయి, ఆగమ సలహాదారు, కంకణభట్టార్‌ శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి, ఏఈవో ప్రభాకర్‌ రెడ్డి, సూపరింటె-ండెంట్లు- శేషగిరి, మధుసూదన్‌, ఎవిఎస్వోలు సాయిగిరిధర్‌, సురేంద్ర, టె-ంపుల్‌ ఇన్స్పెక్టర్‌ రాజేష్‌ కన్నా ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయం నుండి ఆభరణాలు : 825 గ్రాములు బరువుగల కెంపులు, పచ్చలు, నీలము, ముత్యాలు పొదిగిన బంగారు పతకము, రెండు బాజీ బందులు పద్మావతి అమ్మ వారికి కానుకగా సమర్పించారు. ఏటా పంచమితీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసు కెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఆభరణంతో కూడిన శ్రీవారి సారెను అలిపిరి వద్ద అదన పు ఈవో ఎవి.ధర్మారెడ్డి తిరుపతి జెఈవో వీరబ్రహ్మంకు అందజేశారు. అక్కడి నుండి తీసుకొచ్చిన సారెను అమ్మవారి ఆలయం వద్ద ఈవో కె.ఎస్‌.జవహర్‌ రెడ్డికి జెఈవో అందించారు.
కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం
వాహన మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు ఉదయం 10 నుండి 11.30 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వ హించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. కుంకుమ పూవు, యాలకులు, ఆప్రికాట్‌ గ్రేప్స్‌, నెమలి ఈకలు, కొబ్బరి ఆకు, రోజా పూలు, తులసి మాలలు, కిరీటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆకట్టు-కున్న ఫలపుష్ప మండపం: టీటీడీ గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో తామరపువ్వులు, ఆపిల్‌, గ్రీన్‌ ఆపిల్‌, ద్రాక్ష, పైనాపిల్‌, రోజా, సంపంగి, కట్‌ ప్లవర్స్‌తో వాహన మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. నేడు పుష్పయాగం : బ్రహ్మోత్సవాల మరుసటి రోజైన 9వ తేదీ గురువారం సాయంత్రం 4 రాత్రి 7 గంటల వరకు ఆలయంలో పుష్పయాగం జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం లోని శ్రీకృష్ణముఖ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement