Friday, May 17, 2024

మనసెరిగిన మాధవుడు!

గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజా రి. చాలా నిరుత్సా#హంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కార ణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది.
ఈరోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆ లోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో తెలియడంలేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడంలేదు. అతని గోడు వినే వారెవ రూ? నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృ ద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది.
మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్ర#హంచుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటి నుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.
ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి? దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎం తో భక్తిశ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కష్ణ మయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు.
అయితే కాలానికి అందరూ తలవంచవలసిందే కదా! పూజారికి వృద్ధాప్యం వల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాల న్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు అతని కుమారునికి బాధ్య తలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు! అదీ అతని వ్యధకు కారణం!
ఓ కష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవు తున్నా. నేను నిస్సహాయుణ్ణి!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి ఆలయానికి తాళంవేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు. చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు.
తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!
కుమారుడు బిగ్గరగా అరుస్తూ, ”నాన్నగారూ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!” అని నోట మా టరాక ఆయాసపడుతున్నాడు.
వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ, ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్ర#హం కూర్చొని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చొని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.
భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్పించుకో గలగడమే కదా! అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!
ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వా స్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూ పే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.

Advertisement

తాజా వార్తలు

Advertisement