Monday, April 29, 2024

తగ్గిన భక్తుల రద్దీ… శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 5 గంట‌ల స‌మ‌యం

తిరుమలలో భక్తుల రద్దీ త‌గ్గుముఖం ప‌ట్టింది. రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచియున్నారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌కు ఐదు గంటల స‌మ‌యం ప‌డుతుంద‌ని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 66, 086 మంది భక్తులు దర్శించుకోగా 27,305 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.72 కోట్లు వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement