Monday, May 6, 2024

ఈశ్వరుని సర్వభావంతో ఆరాధించాలి!

కోటి జన్మార్జితై: పుణ్య: శివే భక్తిర్విజాయతే…
కోటి జన్మలలో సంపాదించిన పుణ్యం ఉంటేనే కాని శివుని పట్ల భక్తి కలగదని ఘోషిస్తున్నది శివగీత. ‘శివ’ అనే రెండక్షరాలే మన పాపాలను పటాపంచలు చేసి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. సూత్రంలో మణులు ఉండేటట్లుగా ఈ సమస్త ప్రపంచంలో ఆ దేవాది దేవుని అష్ట మూర్తులు వ్యాపించి ఉన్నాయి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రు డు, భీముడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడు…అనేవి ఆయన అష్టమూర్తుల పేర్లు. ఈ శర్వాది అష్టమూర్తులే.. పృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, క్షేత్రజ్ఞ, సూర్యచంద్రులను.. అధిష్టించి ఉన్నా యి. ఈ అష్టమూర్తులను ఆధారం చేసు కొని విశ్వమంతా వ్యాపించిన భగవంతుని సర్వ తోభావంతో ఆరాధించాలని శివపురాణం తెలియజేస్తున్నది.
ఓం శర్వాయ క్షితిమూర్తయే నమ: ఓం భవాయ జలమూర్తయే నమ:
ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమ: ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమ:
ఓం భీమాయ ఆకాశమూర్తయే నమ: ఓం పశుపతయే యజమానమూర్తయే నమ:
ఓం మహాదేవాయ సూర్యమూర్తయే నమ:
ఓం ఈశానదేవాయ చంద్రమూర్తయే నమ:
దేహూ దేవాలయ: ప్రోక్తో జీహాదేవ సనాతన:|
త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోహం భావయే పూజయేత్‌||
జీవుని దేహమే దేవాలయం. మాయావిముక్తుడైన జీవుడే సదాశివుడు. అజ్ఞానమనే నిర్మాల్యాన్ని విడిచి ‘సోహం’ భావంతో సదాశివుని, పూజించాలి. రుద్రో జనానాం హృదయే సన్నివిష్ట:| ప్రాణష్యంతర్మనసో లింగమాహు:||

హృదయంలో ఉన్నవాడు రుద్రాలింగశాబ్దవాచ్యుడైన శివుడిని శ్రుతులు చెబుతున్నాయి. అందుకన హృదయంలో ఆ ఆత్మలింగాన్ని స్థాపించుకొని నిర్మ లమైన మనస్సు నుండి వెలువడే శ్రద్ధా నదీజలంతో మహాదేవుని అభిషేకించి, సమాధి పుష్పాలతో పూజించి, మోక్షాన్ని పొందాలి. బ్రహ్మచారులు యాజ్ఞవ ల్క్యుని చేరి ”ఏ మంత్రంచేత మనుష్యుడు మోక్షంపొందుతాడు” అని అడిగారు.

దానికాయన.. ”శతరుద్రీయేణతి” అన్నారు..
అంటే.. శతరుద్రీయంచేత అని..
‘శతం రుద్రా దేవతా యస్య’
నూరుమంది అంటే పెక్కుమంది రుద్రులు. వారు దేనికి దేవతలో… అలాంటిది శత రుద్రీయం అని తైత్తరీయసంహత చతుర్థకాం డ పంచమ ప్రశ్నాత్మకమైన రుద్రాధ్యాయం పేర్కొంటున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement