Saturday, May 18, 2024

14న స‌మ‌తా కేంద్రంలో గోదారంగ‌నాధుల క‌ల్యాణం….

ముచ్చింత‌ల్ – శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జియ్య‌ర్ స్వామిజీ దివ్య మంగ‌ళ శాస‌న‌ముల‌తో ఈ నెల 14 వ తేదీ (శ‌నివారం) సాయంకాలం ఐదు గంటల నుండి గోదారంగనాధుల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వ‌హించ‌నున్నారు… ముచ్చింత‌ల్లోని స‌మతా మూర్తి స్ఫూర్తి కేంద్రం బయటి ప్రాంగణంలో నిర్వ‌హించ‌నున్నారు.. ప్ర‌తి ఒక్క‌రూ దర్శించుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.. 108 దివ్య దేశముల దర్శనం కోసమే నియమములు వర్తిస్తాయని నిర్వ‌హ‌కులు పేర్కొన్నారు.. క . కళ్యాణ మహోత్సవంలో ఉదయదారులుగా పాల్గొనవచ్చు. నూతనముగా గోదా కృష్ణుల పెరుమాళ్లను పొందాలి అనుకునేవారికి అవకాశం క‌ల్పించ‌నున్నారు.. మ‌రిన్ని వివరాల‌కు: 7382046888 నెంబ‌ర్ సెల్ లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement