Monday, May 6, 2024

తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోఅగ్ని ప్రమాదం

తిరుమల, ప్రభన్యూస్‌:తిరుమల నుంచి తిరుపతి వెళ్లే మొదటి ఘాట్‌రోడ్డులో చివరి మలుపు వద్ద ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్డులోని వినాయకుడి గుడి సమీపంలోని అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రోడ్డుకు సమీపంలోనే మంటలు ఎగసి పడుతుండడంతో వాహన దారులు భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అటవిశాఖ, విజిలెన్స్‌ అధికారులు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగా మంటలు భారీగా ఎగసి పడుతుండడంతో మంటలను అదుపులోకి తెచ్చి ట్రాఫిక్‌ను అటవి, ఫైర్‌, విజెన్స్‌ సిబ్బంది పునరుద్దరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement