Thursday, May 2, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 20 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు తిరుమ‌ల‌కు భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం కావ‌డంతో తిరుమ‌ల‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. కంపార్ట్‎మెంట్లు మొత్తం నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 20 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 75,728 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 38,092 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement