Saturday, May 4, 2024

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 13 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 13 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న శ్రీవారిని 71,289 మంది భక్తులు దర్శించుకోగా 33,210 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.71 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement