Sunday, May 19, 2024

తిరుమలలో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తుల రద్దీ కొనసాగుతుంది . శ్రీవారి సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. వీరికి 10 గంటల్లో దర్శనం కలుగు తుందని టీటీడీ వర్గాలు తెలిపాయి. నిన్న స్వామివారిని 67, 525 మంది భక్తులు దర్శించుకోగా 31,484మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.24 కోట్లు వచ్చిందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement