Sunday, May 19, 2024

తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. గ‌త ప‌ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకోగా 37,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement