Thursday, May 2, 2024

కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతాం : టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మరో 1200 ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌లం వెంక‌ట‌పాళెం గ్రామంలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలో విగ్రహ ప్రతిష్ట చేయడానికి నిర్వహించిన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ ఆలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిలోనూ శ్రీవారి ఆలయం నిర్మించామని వెల్లడించారు. మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement