Thursday, May 16, 2024

”బ్రహ్మముడి”

పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు.
వివాహంలో ”బ్రహ్మముడి”ని ఎందుకు వేస్తారు..? మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తికి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.
కంద పిలక, తమలపాకు, వక్క, పసుపు కొమ్ము, ఖర్జూరపు కాయ, చిల్లరనాణం కలిపి , వధూవరుల కొంగుకు కట్టి, ఇద్దరి కొంగులను కలిపి ముడి వేస్తారు. కంద ఒకచోట పాతితే దినదిన మూ వృద్ధి చెందుతూ, ఎకరాలకు ఎకరాలు వ్యాపిస్తూ పోతుంది. కందలాగా అనుదినమూ వారి బంధము వృద్ధి చెందుతూ, వంశ వృద్ధిని చెయ్యాలని కందను కడతారు.
క్షయం లేనిది ఖర్జూరపుకాయ. దంపతుల బంధమూ, వంశమూ, క్షయం లేకుండా ఉండాలని ఖర్జూరపుకాయను కడ తారు. అందాన్ని, ఆరోగ్యాన్ని, పవిత్రతనూ, పెంపొందించే ఔష ధం పసుపు. ఆయురారోగ్యాలతో , పవిత్రంగా ఉండాలని పసుపు కొమ్ములను కడతారు. ఇకపోతే, ఆకు-వక్క అనేది విడివిడిగా ఉన్నా, కలిస్తే ఎర్రగా పండుతాయి. దంప తులు ఇరువురూ ఒకటే ప్రాణంగా ఉంటూ, వారి కాపురాన్ని నూరేళ్ళ పంటగా పండించు కోవాలని ఆకు, వక్క కడతారు. మనకు తెలిసినదే, చిల్లర నాణం లక్ష్మీస్వరూపం. అ్టషశ్వ ర్యాలతో వృద్ధి చెందాలని చిల్లర నాణం కడతారు.ఇన్ని పరమార్ధాలు ఉన్న…కంద పిలక, పసుపుకొమ్ము, ఖర్జూ రపుకాయ, ఆకు, వక్క, చిల్లరనాణం కలిపి పురోహితుడి రూపంలో ఉన్న సాక్షాత్‌ బ్రహ్మదేవుడే వేదమంత్రాల నడుమ పెద్దల ఆశీర్వ చనములతో ముడి వేస్తే, ఆ కాపురానికి తిరుగు లేదని మన ప్రగాఢ నమ్మకం, విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement