Tuesday, May 14, 2024

అనూరుడు వరఫలమే బ్రహ్మ ముహూర్తం!

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారం గా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడి య ల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రి నీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తా లు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మ ముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూ ర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడా నికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియ ల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతి రోజు బ్రహ్మముహూర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి కూడా తోడవుతుంది.

పురాణగాథ

బ్ర#హ్మము#హూర్తం అనే పేరు ఎలా వచ్చింద నే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించినవాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రు డిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూ రుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదట గా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాల మంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహా లుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమి చ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభకార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోం ది. ఈ బ్ర#హ్మ ము#హూర్తకాలమున చదివే చదు వు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతా యని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వర కు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యా త్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతం గా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా ప్రశాంతంగా ఉం టుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావా లంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అం దుకే ఆ సమయంలో యోగులు, పరమహంస లు, సన్యాసులు, ఋషులు… హమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తప:శక్తి తరంగా లను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువ లన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యా త్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాం టి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయా మం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయ టం చాలా మంచిది. పద్మాసనంలో గానీ, సుఖా సనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమ యంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముం దు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్త న పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానం లో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది అని చెబుతారు. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపు డైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పనిచేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కు దురుతుంది. ఇది తంత్ర… క్రియాయోగ రహస్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement