Friday, May 17, 2024

హనుమ స్మరణలో రామాంజనేయాభయం

హైందవ సంస్కృతిలో పెక్కు పండగలు న్నాయి. అవి రుతుపర, మత ప్రమేయ, పురాణతి హాస సంబంధమైనవి. అందులో అసమాన భక్తాగ్రేసరుడు, ఆదర్శ పురుషుడు, నమ్మిన బంటు, సంస్కృతాద్యనేక భాషలు, వ్యాకరణాది శాస్త్రాలు, సంగీ తాది కళలలో నిష్ణాతుడు అయిన హనుమంతుని జయంతి ఒకటి.
అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్‌శ్చ విభీషణ: కృప: పరశురామశ్చ సప్తయితే చిరజీవిన: మార్కండేయస్తు అష్టమ: ప్రోక్త:. అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమం తుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురా ముడు, మార్కండేయుడు తదితరులను చిరంజీవులుగా భావిస్తారు.
ఒక కల్పం అంటే నాలుగు వందల ముప్పయి రెండు మిలియన్ల సంవత్సరాలు జీవించే ఎనిమిది మంది చిరంజీవులలో ఒకరైన హనుమంతుని జయంతి ప్రత్యేకత కలిగి ఉంది. భారతావనిలో వివిధ ప్రాంతాలలో హనుయిన్‌ జయంతిని వివిధ మాసాలలో జరుపుకుంటారు. ఆంజనేయుడు, హనుమం తుడు, హనుమాన్‌, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఉత్తర భారత దేశంలో వారణాసిలో సంకట మోచన దేవాల యం, అయోధ్యలో హన్మాన్‌ గార్హి దేవాల యాల లో ఈ పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ”మార్గళి” మాసం అనగా డిసెంబర్‌ లేదా జనవరిలలో జరుపుకుంటారు. ఒరియా క్యాలెండర్‌ ప్రకారం వృషభ సంక్రాంతి మొదటి రోజున వైశాఖంలో పాటించే ఆచారం ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలలో వైశాఖ కృష్ణపక్ష మందు పెద్ద హన్మాన్‌ జయంతిగా జరుపుకునే సాంప్రదాయం ఉంది. చైత్ర పౌర్ణమి (చిన్న హన్మాన్‌ జయంతి)తో ప్రారంభించి, హన్మాన్‌ దీక్షలను వైశాఖ కృష్ణ పక్ష దశమి (పెద్ద #హన్మాన్‌ జయంతి)కి ముగిసేలా 41రోజుల మండల దీక్షలను చేపట్టడం ఆనవాయితీగా, సాంప్రదాయ సిద్ధంగా వస్తున్నది. ప్రధానంగా రామాయణంలో హనుమంతుని పాత్రఅద్వితీయం. రామాయణం లోని ఆరు కాండల్లోని చివరి మూడు కాండల్లో కథ నడిపిన మహనీయుడు హనుమంతుడు. హనుమంతుని స్తుతించే హనుమత్కవచాన్ని ఆంజనేయాలయంలో లక్ష ఇరవై అయిదు సార్లు పఠించిన వారికి గాలిలో ఎగిరే శక్తి, ఆణిమా ద్యష్టసిద్ధులు లభ్యమవుతాయని నమ్మకం. ప్రేతపతి అయిన శివునికి ఎంత భూతాల మీద ఆధిపత్యం ఉందో హనుమంతునికి కూడా అటువంటి శక్తి ఉందని భావిస్తారు. పంచభూతా లను వశం చేసుకున్న పరమాత్ముడు అయన. జ్ఞానేంద్రియాలను నియంత్రణలో ఉంచుకోగలి గిన మహాశక్తిశాలి. అందుకే గ్రహపీడకు ఆంజనేయుని కొలుస్తారు. ఉన్మాద రోగాలకు ఆంజనేయ ప్రదక్షిణలు చేస్తారు. చిన్న పిల్లలకు ఆంజనేయ బొమ్మ చెక్కిన యంత్రపు బిళ్ళలను మెడలో కడుతారు. పిల్లలు, పెద్దలు ఆపత్సమ యాలలో, భయం కలిగే వేళలలో ఆంజనేయ దండకం చదువడం చిరకాలంగా అనుసరి స్తున్న సంప్రదాయం. శివాజీ గురువైన సమర్ధ రామదాసు హను మంతుని భక్తుడు కాగా, మహారాష్ట్రుల జెండా మీద గదాపా ణియైన హను మంతుడు ఉంటాడు. పాండవ మధ్యముడైన అర్జునుని జెండాపై ఉపవిష్ణుడై హనుమం తుడు మహా భారత యుద్ధంలో అర్జునునికి రక్షణగా ఉన్న గాథ అందరికీ తెలిసిందే.
#హనుమంతుడికి స్వర్గ ప్రాప్తి లభిం చినా, అందుకు అంగీ కరిం చక, తాను భూమి పైనే రాముడి భక్తుడిగా కల కాలం ఉండిపో తానని కోరుకు న్నాడనిఒక కథ. అందుకు శ్రీరాము డు కూడా ఒప్పుకుం టాడు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆంజనే యుడు, అవతార పురుషుడు అయిన శ్రీ రాముడినే తన హృద యంలో బంధించిన మేటి భక్త్తుడు హనుమ #హను మంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తుని గా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హం దూ మతంలో అత్యం త భక్తి శ్రద్ధలతో కొలువబడే దైవంగా నిత్య పూజలు అందుకుం టున్నాడు.
ప్రతి గ్రామానికీ ఆయన క్షేత్ర పాల కుడు. అంట గ్రామ రక్ష కుడు. భగవద్దాసులలో సాటిలేని ఆంజనేయుని పూజకు ఉద్ది ష్టమైన చైత్ర పూర్ణిమ తోపా టు, వైశాఖ బహుళ దశమి నాడు కూడా ప్రత్యేక ఆర్చనలు, పూజా దులు నిర్వహించడం సదా చారసాం ప్రదాయంగా వస్తు న్నది. రావణుని బారి నుండి శనిని ఆంజనే యుడు కాపాడు తాడు. అందుకు రుణ పడిన శనీశ్వ రుడు, హనుమంతుడిని సేవించేందుకు ఉద్యుక్తుడవుతాడు. అయితే తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీ శ్వ రుడిని హనుమ అడుగుతాడు. అప్పటి నుంచి హనుమం తుడిని కొలిచే వారిపై శని చెడు ప్రభా వం ఉండ దనే విశ్వాసంతో,శని దేవునిపూజించే వారు తప్పనిసరిగా అంజన్నను కొలుస్తారు. అంతేకాదు హనుమాన్‌ చాలీసా రోజూ పఠిస్తే శని చెడు ప్రభావం సోకదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494

Advertisement

తాజా వార్తలు

Advertisement