Saturday, May 4, 2024

సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠాపనకు ముహూర్తం ఖరారు

సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జరగనున్న ఈ విగ్రహావిష్కరణకు రావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను ఆహ్వానించారు త్రిదండి చినజీయర్‌ స్వామి. ఢిల్లీలో రాష్ట్రపతికి స్వయంగా చినజీయర్‌ స్వామి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. శంషాబాద్‌ ముచ్చింతల్‌ చినజీయర్‌ స్వామి ఆశ్రమంలో అతిపెద్ద సమతా మూర్తి విగ్రహం ఏర్పాటు- కాబోతోంది. 200 ఎకరాల్లో వెయ్యికోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజ పంచలోహ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. శ్రీనివాస రామానుజం, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర రావు రాష్ట్రపతిని కలిశారు. విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించనున్నారు. యాగంలో 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. అటు- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిసిన చిన్నజీయర్‌ స్వామి, మైహోం గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర రావు విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement