Monday, May 6, 2024

సంపాతి సహాయంతోనే సీత జాడ తెలిసిందా

సీతాన్వేషణలో విఫలమై, నిరాశా నిస్పృహలతో అంగదుడి ఆజ్ఞానుసారం ఏ ప్రదేశంలోనైతే వానరులు చావాలని నిర్ణ యించారో, ఏ ప్రదేశంలోనైతే అంగదుడు దర్భల మీద పడుకుం టాడో, అక్కడే, దీర్ఘకాలం జీవించివున్న గద్దలకు రాజు సంపాతి పర్వతగుహలో నుండి బయటకు వచ్చి, వానరులందరినీ చూశాడు. తానున్న చోటుకే దైవం కొత్త ఆహారాన్ని తెచ్చిందనుకున్నాడు. సంతో షంగా ఈ వానరులను దినానికి ఒకరిని చంపి తింటాను అన్నాడు.
ఆ మాటలకు భయపడ్డ అంగదుడు హనుమంతుడితో ”ఆంజ నేయా! ఆహారం మీద ఆశ కల ఆ పక్షిని చూశావా? మనమేమో శ్రీ రాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. ఇంతలో ఈ ఆపద సంభవిం చింది. సీతాదేవికి మేలుచేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిం దో తెలుసుకదా! అలాంటి గతే మనకిప్పుడు తటస్థించింది. రామ చంద్రమూర్తికి ఉపకారం చేయడానికే ధర్మం తెలిసిన జటాయువు శరీ రాన్ని విడిచి కీర్తి గడించింది. కాబట్టి ఆయనే పుణ్యాత్ముడు. దశరథు డు చావడం, సీతను రావణుడు అపహరించడంవల్ల మనకు ప్రాణా పాయం సంభవించింది” నేలమీద పడిన వానరులు అంగదుడు చెప్పి న వృత్తాంతం వింటుండగా సంపాతి మనస్సు చలించి, పరితాపం కలగడంతో, ఇలా అన్నాడు. ”అయ్యో! ఎన్ని రోజులకు నా తమ్ముడి పేరు వినడం జరిగింది! నా ప్రాణాలకంటే వాడు నాకు ప్రియుడు. వాడి మరణవార్త వినడంతో నా హృదయం చలించింది. దండకలో రావ ణాసురుడికి, వాడికి యుద్ధం ఎందుకు జరిగింది? ఆ యుద్ధంలో ఎలా చనిపోయాడు? వానరా! ఆ కథంతా చెప్పే నువ్వెవరివి? మీరు గొప్ప మనస్సుతో నన్ను కొండ మీదనుండి కిందకు దింపమని వేడుకుంటు న్నాను. నా తమ్ముడు మిక్కిలి బలశాలి. ఎన్నో సుగుణాలను తెలిసిన వాడు. అతడిని మీరు పొగుడుతుంటే ఇన్నాళ్లకు వినగలిగాను. రామ చంద్రమూర్తి తండ్రైన దశరథమహారాజుకు నా తమ్ముడు స్నే#హతుడె లా అయ్యాడు? వానరులారా అదంతా వినాలని వుంది. సూర్యకిరణా లతో నారెక్కలు కాలిపోవడంవల్ల నేను కొండ దిగలేను. నన్ను మీ దగ్గ రకు తీసుకుపోండి”. వానరులలో కొందరు వెళ్ళి సంపాతిని కొండమీదనుండి దింపారు. అప్పుడు అంగదుడు సంపాతితో – ”ఓ పక్షి శ్రేష్టమా! విను. దశరథ మహారాజు కొడుకు, రామచంద్రమూర్తి, తండ్రి ఆజ్ఞానుసారం తన భార్యతో, తమ్ముడితో దండకారణ్యంలో ప్రవేశి ంచాడు. ఆ సమయంలో రావణాసురుడు రాముడు భార్య సీతాదేవిని అపహరించాడు. అలా తీసుకెళ్తున్న సమయంలో దశరథు ని స్నే#హతుడైన జటాయువు జానకీదేవిని చూశాడు. ఆమెను విడిపిం చాలని ఆకాశంలో వెళుతున్న రావణుడిని ఎదుర్కుని, రథాన్ని విరిచి ఆమెను భూమ్మీదకు దించాడు. అంతటితో ఆగకుండా రావణుడితో యుద్ధానికి దిగాడు. పక్షిరాజు రెక్కలను రావ ణుడు నరికాడు. అంతట జటాయువు మరణించాడు. రామచంద్రమూర్తి అతడికి అగ్ని సంస్కా రాలు చేసి ఉత్తమలోకాలు ప్రసాదించా డు. ఆ తరువాత నా పినతండ్రి సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి వాలిని చంపాడు. ఆ తరువాత సీతను వెతకడానికి మమ్మల్ని దక్షిణ దిక్కుకు పంపాడు సుగ్రీవుడు. ఆమె కోసం మేం వెతికాం కాని ఆమె మాకు కనబడలేదు. కార్యం సాధించకుండా వెనక్కు తిరిగిపోతే మా ప్రాణాలు దక్కవు. కాబట్టి ఇక్కడే మరణిద్దామని నిశ్చయించుకున్నాం.” అన్నాడు.మరణానికి సిద్ధమైన వానరులు దు:ఖపడుతూ తమ చరిత్రను తెలపగా సంపాతి వారితో ఇలా అన్నాడు. ”రావణుడి చేతిలో చనిపో యిన జటాయువు నా తమ్ముడు. అతడి మరణవార్త తెలిసి కూడా రెక్క లు కాలిపోవడం వల్ల, ముసలివాడినైనందున, పగ తీర్చుకునే బలం లేనందున, ఏమీ చేయలేక ఇలా వూరికే వున్నాను. పూర్వం వృత్రుడికి, ఇంద్రుడికి యుద్ధం జరుగుతున్న సమయంలో మేమిద్దరం మా వేగం తెలుసుకోవడానికి, ఒకరినొకరు గెలవాలన్న కోరికతో ఆకాశానికి ఎగి రి, సూర్యమండలం సమీపించడానికి ప్రయత్నించాం. చక్రాకారంలో గాలిలో తిరుగుతూ, ఆకాశాన మేం పోతున్నప్పుడు సూర్యుడు నడి నెత్తికి వచ్చాడు. అప్పుడు తమ్ముడు ఆ ఎండ వేడిని సహంచలేక బాధపడ్డాడు. నేనప్పుడు ప్రేమతో అతడికి ఎండ తగలకుండా రెక్కలతో కప్పాను. ఫలితంగా నా రెక్కలు కాలిపోవడం, నేను వింధ్య పర్వతం మీద పడడం జరిగింది. నేనిక్కడ వుండడం వల్ల నా తమ్ముడి గురించిన వార్తలు వినలేకపోయాను”.
ఇలా అంటున్న సంపాతితో అంగదుడు ”నువ్వు జటాయువు అన్నవే అయితే, నేను చెప్పినదంతా విన్నావు కదా! నీకు తెలిసుంటే, రావణుడు వుండే చోటు ఇక్కడికి దగ్గరలో వుందా? దూరంలో వుందా? చెప్పు” అన్నాడు.
అంగదుడి మాటలకు జవాబుగా ”నేనిప్పుడు శౌర్యం లేనివాడి ని. కాబట్టి నేను విశేష సహాయం మాత్రం చేయలేను. మాట సహాయం తప్పకుండా చేస్తాను. నాకు రావణాసురుడి విషయమే కాదు. రావ ణుడు తీసుకుని పోతుంటే నిడుపాటి కళ్ళుకల ¸°వనవతిని, సమస్త భూషణాలతో ప్రకాశించే దానిని, కన్నీరు కారుస్తూ శరీరం మీద ఆభర ణాలను ఒక్కటొక్కటే పారవేస్తూ బాధపడుతున్న ఒక స్త్రీని చూశాను. ఆమె రామా! లక్ష్మణా! అని ఏడిచింది. కాబట్టి ఆమె సీతాదేవి అని భావిస్తాను. ఆ రాక్షసుడు వుండేచోటు చెప్తా విను”.
”రావణాసురుడు లంకాపురంలో వుంటాడు. సముద్రానికి ఇక్క డి నుండి నూరామడల దూరంలో ఒక ద్వీపం వుంది. అదే రావణుడు వుండే పురం. ఆ పురంలో రాక్షస స్త్రీల కాపలాలో సీత దు:ఖిస్తున్నది. సముద్రం మీద నుండి దక్షిణ దిక్కుగా మీరు నూరామడలు పోతే, అక్కడ లంక వుంటుంది. అక్కడికి పోయి రావణాసురుడిని చూసి, ఫల సిద్ధి పొంది రండి. మీ పరాక్రమం చూపడానికి తొందరపడండి. ఆల స్యం చేయవద్దు. నా జ్ఞాన దృష్టితో చూశాను. మీరు కార్యం సఫలం చేసుకుని రాగలరు. మాకు స్వభావంగా ఇలాంటి దృష్టి కలగడానికి కారణం మేమేమో దూరం ఆహారం తినడానికి వెళ్ళాలి. మాకు కావా ల్సిన ఆహారం సమీపంలో దొరకదు. ఆ కారణాన భగవంతుడు మా కు దూరదృష్టి ఇచ్చాడు. వానరులారా! దానికి తగ్గ విధంగా మీరు చేయ బోయే కార్యం నా తమ్ముడిని చంపినదానికి బదులు కావాలి. సము ద్రాన్ని దాటే ఉపాయం వెతకండి. సముద్రం దాటి లంకలో వున్న సీత ను చూసి ధన్యులై కిష్కింధకు వెళ్ళండి. చనిపోయిన నా తమ్ముడికి సముద్ర జలంతో తర్పణం చేయాలి. కాబట్టి మీరు నన్ను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి”. సంపాతి చెప్పిన విధంగానే వానరులు చేశారు. మళ్లిd ఆయన వున్నచోటుకు తెచ్చి దింపారు.
జాంబవంతుడు లేచి సంపాతితో ”సీత ఎక్కడ వుంది? ఎవరైనా చూశారా? ఆమెను అపహరించిన రాక్షసుడు ఎక్కడివాడు? పక్షి రాజా! అంతా చెప్పి వానరులను రక్షించు.రాముడి బాణాలను ఆ మూఢుడు లక్ష్యం చేయడం లేదు”. జాంబవంతుడి ప్రశ్నకు ఇంత కుముందే సమాధానం చెప్పిన సంపాతి, సీతాపహరణం గురించి తాను విన్నది, కన్నది, సీత వుండే ప్రదేశం గురించి మళ్లిd చెప్పాడు.
”వానరులారా! వినండి. రెక్కలు విరగడంతో నేనీ కొం డ మీదే వుంటాను.నామీద పితృభక్తి వల్ల నా కొడుకు సుపార్శ్వుడు ఆహారం తెచ్చి ఇచ్చేవాడు. ఒకనాడు ఆకలి వేసి ఆహారానికి ఎదురు చూస్తుండగా సూర్యాస్తమానమైన తరువాత ఆహారం తేకుండానే నా దగ్గరికి వచ్చా డు. ముసలివాడికి కోపం ఎక్కువ కాబట్టి దప్పికతో వాడిని నిందిం చాను. నన్నాతడు శాంతపరచి ఏమన్నాడంటే, తాను మహంద్ర పర్వ తం దగ్గర వున్న సమయంలో ఎవరో ఒక స్త్రీని తీసుకుపోవడం చూశా డట. వాడు రావణుడనే రాక్షస రాజని సిద్దులు అంటుంటే విన్నాడు నా కొడుకు. ఆ సిద్దులే, దుర్నీతిపరుడైన రావణుడు రాముడి భార్య సీతను బలవంతంగా అపహరించుకుని పోతున్నాడని, రామా! లక్ష్మణా! అని ఏడుస్తున్న ఆ స్త్రీ సీతేనని అన్నారట. ఇలా వారన్నారని నా కొడుకు నాకు చెప్పాడు. వానరులారా! ఏది రామకార్యమో, అది నా సొంత కార్యమే! ఇది సత్యం. ఇందులో సందేహం లేదు. మీరు సుగ్రీవుడు పంపగా వచ్చారు. కాబట్టి ఆలశ్యం చేయవద్దు”.
తనకు రెక్కలు తిరిగి ఎలా వస్తాయో నికాశరుడు అనే మునీశ్వరు డు తనతో అన్న మాటలు చెప్పాడు. ”ఇక్ష్వాకు వంశంలో దశరథరాజు పుట్తాడనీ, అతడికి రాముడు అనే కొడుకు కలుగుతాడనీ, ఆయన తం డ్రి మాట ప్రకారం తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అరణ్యాలకు వస్తాడ నీ, ఆ రామచంద్రుడి భార్య సీతాదేవిని రావణాసురుడు అపహరిస్తా డనీ, రామదూతలైన వానరులు సీతాదేవిని వెతుకుతూ తను వుండే ప్రదేశానికి వస్తారనీ, వారికి సీతాదేవి వృత్తాంతం తెలిపితే నాకు మేలవు తుందనీ, నేను ఈ ప్రదేశం వదిలి ఎక్కడికీ పోవద్దనీ, ఇక్కడే వుండాలనీ నిశాకరుడు చెప్పాడు. విస్తార కీర్తికల రామచంద్రుడిని చూడాలని ఆశ వుందికాని, అంతకాలం బతకడానికి మనస్సంగీకరించడం లేదు. కాబట్టి దేహాన్ని వదులుతాను” అంటాడు సంపాతి.
ఇలా సంపాతి చెప్తుండగానే సంపాతికి రెక్కలు మొలిచాయి. తన రెక్కలను చూసుకుని సంపాతి సంతోషించాడు. ”ఏవిధం గానైనా సరే, ఎంత కష్టపడైనా సరే మీరు సీతాదేవిని వెతకండి. నాకు రెక్కలు వచ్చిన వ్యవహారం చూస్తుంటే మీరు ఆయన చెప్పినట్లు సీతను చూడగలరని నమ్మకం కలుగుతున్నది. నాకు ఆజ్ఞ ఇస్తే నేను ఆకాశమార్గాన వెళతాను”. అని చెప్పి సంపాతి వెళ్లిపోగా వాన రులు సీతాదేవిని వెతకడానికి ఆమె వున్న దిక్కుకు పయనించారు సముద్ర తీరాన్ని చేరారు. అక్కడ దక్షిణ సముద్రా న్ని తేరిపార చూశారు. వానరుల దేహాలు పులకరించాయి. వివిధ రకాల వికార జంతు సమూహాలతో నిండిన ఆ సముద్రాన్ని చూసి, విచారపడి, దాన్ని ఎలా దాటాలా అని భయపడ్డారు. అంగదుడు వారికి ధైర్యం చెబుతూ-
”ఈ సముద్రాన్ని దాటి ఆ వానరుల ప్రాణభయం పోగొట్టగల మహాబలవంతుడు ఎవరో? మహాతేజం కలవాడెవరో? అలాంటి సామర్థ్యంకల వానర శ్రేష్టుడు వుంటే ఆయన వానరులందరికీ ప్రాణ దానం చేయుగాక. వానరులారా! మీరు బలవంతులలో ఉత్తములు. అధిక పరాక్రమం వల్ల పొగడబడిన వారు. గొప్ప వంశంలో పుట్టిన వారు. ఇలాంటి మీకు ఎలా పోయినా, ఏ సమయంలో పోయినా, పోలే ని స్థలం లేదు. ఇదివరకు లాగానే ఇప్పుడు కూడా అందరం కలిసి దాటి పోదామా? కానీ అది సాధ్యం కాదేమో అనిపిస్తోంది. అంతా దాటగలి గితే అందరం కలిసే పోదాం. ఈ సముద్రాన్ని ఎవరెవరు వారివారి శక్తికొలది ఎంతమేరకు దాటగలరో ఆలోచించి చెప్పండి” అన్నాడు.
అంగదుడి మాటలకు వానర వీరులు ఎవరికివారే ఆ అవకాశం తీసుకోవాలని ముందుకు రాసాగారు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)

– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement