Wednesday, May 22, 2024

రేపు ప్రవేశ దర్శనం, ఎల్లుండి సర్వదర్శనం ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవేంకటేశ్వ రస్వామివారి దర్శనం నవంబర్‌, డిసెంబర్‌ నెలలకు సంబంధించి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్‌ఈడి) టోకెన్లు అక్టోబర్‌ 22వ తేది ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అయితే డిసెంబర్‌ 8వ తేది తిరుచానూరు శ్రీపద్మావతిఅమ్మవారి పంచమి తీర్థం, డిసెంబర్‌ 16వ తేది ధనుర్మాసం ప్రారంభం అవు తుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. ఈ కార్యక్రమాల వివరాలు ఖరారు అయ్యాక డిసెంబర్‌ 8 మరియు 16 వ తేదిలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శ నం టోకెన్లు విడుదల చేస్తారు. నవంబర్‌ నెలకు సంబంధించి స్లాటెడ్‌ స్వరదర్శనం టోకెన్లు అక్టోబర్‌ 23వ తేది ఉదయం 9 గంట లకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. తిరుమలలో వసతికి సంబంధించి నవంబర్‌ నెల కోటాను అక్టోబర్‌ 25వ తేది ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయ డం జరుగుతుందని టిటిడి తెలిపింది. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామివారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement